ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ జంట బలవన్మరణం

ABN, First Publish Date - 2020-06-18T09:24:04+05:30

ప్రేమించిన వ్యక్తిని కాదని పెద్దలు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యువతికి మరో పెళ్లి చేసినా ప్రేమికులు ఇద్దరూ ఉరి వేసుకున్నారు


నవాబుపేట, జూన్‌ 17 : ప్రేమించిన వ్యక్తిని కాదని పెద్దలు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అతనితో కలిసి జీవించలేక, తిరిగి వచ్చి ప్రియుడితో తాళి కట్టించుకొని ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నారు.   వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల కార్తీక్‌ (20), అదే గ్రామానికి చెందిన కటికె మీన (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే నెల రోజుల క్రితం మీణకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. మీన కార్తీక్‌ను మరిచిపోలేక ఈ నెల 16న అత్తారింటి నుంచి వచ్చేసింది.  కార్తీక్‌తో తాళి కట్టించుకుంది. నవాబ్‌పేట మండలం పూలపల్లి గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీఆర్‌వో సత్తయ్య అందించిన సమాచారంతో నవాబుపేట ఎస్‌ఐ కృష్ణ, వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-18T09:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising