నిత్యావసరసరుకులు పంపిణీ చేసిన సినీ నిర్మాత
ABN, First Publish Date - 2020-04-02T17:39:41+05:30
కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోని బాలానగర్లో నిత్యావసరసరుకులు..
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోని బాలానగర్లో నిత్యావసరసరుకులు, మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సినీ నిర్మాత బెల్లంకొండ రమేష్, రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసరసరుకులు హోం డెలివరి చేసే ఓ సంస్థ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న సూచనలు పాటించాలన్నారు. నిత్యావసరసరుకులు డోర్ డెలివరి చేసే బాయ్స్ కూడా ప్రభుత్వం రూపొందించిన నియమాలను తప్పక పాటించాలన్నారు. ముఖ్యంగా డోర్ డెలివరి సమయంలో శానిటేషన్ మాస్క్లు ధరించాలని డీసీపీ సూచించారు.
Updated Date - 2020-04-02T17:39:41+05:30 IST