ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2020-05-19T02:29:14+05:30

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలస్తోంది. మూడంతస్థుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పెయింట్ షాప్‌ను నిర్వహిస్తున్నారు. షాపులో ఇవాళ అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్తా దావానంలా మారి బిల్డింగ్ మొత్తానికి అంటుకున్నాయి. దీంతో బిల్డింగ్‌లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అర్పేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-19T02:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising