కలబురగి సిమెంట్స్కు 20 లక్షల జరిమానా
ABN, First Publish Date - 2020-11-03T08:21:48+05:30
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు తెలంగాణ సరిహద్దులో ఉన్న
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు తెలంగాణ సరిహద్దులో ఉన్న కలబురగి సిమెంట్స్కు రూ.20 లక్షల జరిమానాను కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) విధించింది.
ఈ సిమెంట్ కంపెనీ వల్ల తమ ప్రాంతాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయంటూ ఎన్జీటీలో రెండేళ్ల క్రితం తాండూరు సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్కు స్పందనగా విచారణ జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా ఈమేరకు జరిమానా విధించారు.
Updated Date - 2020-11-03T08:21:48+05:30 IST