హేమంత్ హత్య కేసులో యువతి తండ్రి, మేనమామ సహా 12 మంది అరెస్ట్
ABN, First Publish Date - 2020-09-25T17:28:09+05:30
హైదరాబాద్: హైదరాబాద్లో మరో పరువు హత్య జరిగిన విషయం తెలిసిందే. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లో మరో పరువు హత్య జరిగిన విషయం తెలిసిందే. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని దారుణంగా హత మార్చారు. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని తండ్రి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కిరాయి హంతకులతో కిడ్నాప్ చేయించి దారుణంగా హత్య చేయించాడు. గచ్చిబౌలిలో నిన్న హేమంత్, అవంతిలను దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో నుంచి అవంతి తప్పించుకుంది. 100కు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. ఈ కేసులో అవంతి తండ్రి, మేనమామ సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2020-09-25T17:28:09+05:30 IST