లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్టాప్ విడుదల
ABN, First Publish Date - 2020-12-01T23:00:07+05:30
లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్టాప్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజి సంస్థ లెనోవా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ల్యాప్టాప్ను విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త ఫీచర్లతో లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్టాప్ను విడుదల చేసినట్లు సంస్థ వెల్లడించింది.
ఎఎమ్డి రైజెన్ 4000 సిరీస్ ప్రాసెసర్ ఉండే లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్టాప్ రూ. 75,990 ఉంటుంది. లెనోవా లెజియన్ 5 ల్యాప్టాప్ బరువు 2.3 కిలోలు ఉండగా, హెచ్డీ వెబ్క్యామ్తో వస్తుంది. లాంచ్ ఆఫర్లలో ఒక సంవత్సరం ఉచిత ప్రీమియం కేర్, ఒక సంవత్సరంపాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ రూ. 3,900 లభించనుంది.
Updated Date - 2020-12-01T23:00:07+05:30 IST