‘...అయినా బీసీసీఐ నిర్ణయమే కరెక్ట్’
ABN, First Publish Date - 2020-08-07T09:42:59+05:30
మహిళల చాలెంజర్ సిరీస్, మహిళల బిగ్బాష్ లీగ్ ఒకే సమయంలో జరగనుండడంపై విదేశీ క్రికెటర్ల అసహనాన్ని అర్థం...
న్యూఢిల్లీ : మహిళల చాలెంజర్ సిరీస్, మహిళల బిగ్బాష్ లీగ్ ఒకే సమయంలో జరగనుండడంపై విదేశీ క్రికెటర్ల అసహనాన్ని అర్థం చేసుకోగలనని టీ మిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. అయితే కరోనా వేళ..నాలుగు మ్యాచ్ల చాలెంజర్ సిరీస్ ఖరారులో బీసీసీఐ ఉత్తమ నిర్ణయమే తీసుకొన్నదని వివరించింది. బిగ్బాష్ లీగ్ జరిగే సమయంలో చాలెంజర్ సిరీ్సను షెడ్యూల్ చేయడంపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్వుమన్ అలీసా హీలీ, న్యూజిలాండ్కు చెందిన సుజీ బేట్స్ తదితరులు ఆగ్రహం ప్రకటించారు.
Updated Date - 2020-08-07T09:42:59+05:30 IST