ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో..సచిన్‌ కన్నా కోహ్లీ మిన్న

ABN, First Publish Date - 2020-07-04T08:45:40+05:30

భారత్‌ తరఫున పరిమిత ఓవర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ప్రశంసించాడు. తెల్లబంతి అత్యుత్తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌ తరఫున పరిమిత ఓవర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ప్రశంసించాడు. తెల్లబంతి అత్యుత్తమ ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలో ఎవరిని ఎంపిక చేసుకుంటావన్న ప్రశ్నకు.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుత టీమిండియా సారథి అని జాఫర్‌ సమాధానమిచ్చాడు. ఇందుకు అతను నమోదుచేసిన గణాంకాలు, సగటే నిదర్శనమని చెప్పాడు. ఇక.. టీమిండియాలో తన ఫేవరెట్‌ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అని జాఫర్‌ తెలిపాడు. ‘2000 తర్వాత అతను జట్టు బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. దూకుడుగా ఎలా ఉండాలో నేర్పడంతో పాటు జట్టులోని సభ్యులకు ఎన్నోసార్లు అండగా నిలబడ్డాడు. సెహ్వాగ్‌, జహీర్‌, యువరాజ్‌, హర్భజన్‌లాంటి వాళ్లు స్టార్లుగా ఎదగడంలో కీలకపాత్ర పోషించాడు’ అని ఉత్తరాఖండ్‌ రంజీ జట్టు కోచ్‌ కూడా అయిన జాఫర్‌ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2020-07-04T08:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising