ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన క్వారంటైన్.. ఇంటికి చేరిన విశ్వనాథన్ ఆనంద్

ABN, First Publish Date - 2020-06-07T02:56:18+05:30

మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన గత శనివారం భారత్‌కు చేరుకున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయి గత శనివారం భారత్‌కు చేరుకున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బెంగళూరులో వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ తర్వాత ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ‘‘అవును నేను ఇంటికి చేరుకున్నాను. కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా కుమారుడిని చూడడం సంతోషంగా ఉంది’’ అని ఆనంద్ పేర్కొన్నాడు.


గత నెల 30న స్వదేశానికి చేరుకున్న ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఏడు రోజుల సంస్థాగత క్వారంటైన్ పూర్తిచేసుకున్నాడు. తాను ఇంటికి చేరుకున్నట్టు చెస్ మాంత్రికుడు ట్వీట్ చేశాడు. బెంగళూరులో తాను క్వారంటైన్‌లో ఉన్న హోటల్‌కు ఈ సందర్భంగా ఆనంద్ కృతజ్ఞతలు తెలిపాడు. 112 రోజుల తర్వాత ఆనంద్ ఇంటికి రావడం ఆనందంగా ఉందని అతడి భార్య అరుణ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుమారుడు అఖిల్ చాలా సంతోషంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T02:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising