ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై బ్యాట్స్‌మెన్స్‌పై సెహ్వాగ్ ట్వీట్ వైరల్

ABN, First Publish Date - 2020-09-26T23:28:27+05:30

ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్స్ 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేశారు. 43 పరుగులతో రాణించిన డుప్లెసిస్ మినహాయిస్తే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. చెన్నై బ్యాట్స్‌మెన్స్ ఆటతీరుపై వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చురకలంటించాడు.


క్రీజులో పరుగులు చేయడానికి చెన్నై బ్యాట్స్‌మెన్స్ బాగా ఇబ్బందిపడుతున్నారని.. తర్వాత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు వెళ్లే ముందు చెన్నై బ్యాట్స్‌మెన్స్‌కు గ్లూకోజ్ ఎక్కించాలని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ కూడా 15 పరుగులకే ఔట్ కావడం గమనార్హం.



Updated Date - 2020-09-26T23:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising