ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్డ్‌ గేమ్స్‌లో విరాట్‌ బిజీ

ABN, First Publish Date - 2020-04-09T09:59:25+05:30

లాక్‌డౌన్‌ సమయంలో విరాట్‌ కోహ్లీ.. అనుష్క శర్మ, ఆమె తల్లిదండ్రులతో ఇంట్లో సరదాగా గడుపుతున్నాడు. అందరూ కలసి మోనోపలీ బోర్డ్‌ గేమ్‌ ఆడుతూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో విరాట్‌ కోహ్లీ.. అనుష్క శర్మ, ఆమె తల్లిదండ్రులతో ఇంట్లో సరదాగా గడుపుతున్నాడు. అందరూ కలసి మోనోపలీ బోర్డ్‌ గేమ్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలా గేమ్‌ ఆడుతున్నప్పటి సంతోష క్షణాలను అనుష్క ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా కుటుంబ విలువల గురించి భావోద్వేగ పోస్టు చేసింది. ‘చిన్ననాటి నుంచి మనల్ని కంటిరెప్పలా కాపాడుతున్న కుటుంబం నుంచే జీవిత ప్రయాణం ఎలా చేయాలి, సమాజంలో ఎలా మెలగాలి, ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా వారి నుంచే నేర్చుకున్నాం. అలా నేర్చుకున్నవే జీవితాంతం మనపై ప్రభావం చూపుతాయ’ని అనుష్క రాసింది. ‘ఇంట్లోనే ఉండండి. ప్రియమైన వారిని సంరక్షించుకోండి. దొరికిన సమయాన్ని సంతోషంగా ఆస్వాదించండి. హాయిగా నవ్వండి, ఆప్యాయతలను కురిపించండి, అపార్థాలను దూరం చేసుకోండి, బంధాలను మరింత బలోపేతం చేసుకోండి, జీవిత స్వప్నాల గురించి ఇతరులతో పంచుకోండి.. మెరుగైన రేపటి కోసం ప్రార్థించండి. ఈ అనుభవాలను రేపటి రోజు ఉపయోగించుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం ఇకనైనా మారుతుంది’ అని శర్మ ఆశాభావం వ్యక్తం చేసింది. చివరగా గేమ్‌ హోరాహోరీగా సాగిందని చెప్పినా.. విజేత ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచింది. కానీ, విరాట్‌ గెలిచాడని ఆ తర్వాత తెలిపింది. 

Updated Date - 2020-04-09T09:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising