ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీకి అంపైర్ వార్నింగ్.. ఏంటా పని అంటూ..

ABN, First Publish Date - 2020-03-02T23:57:41+05:30

న్యూజిలాండ్ పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. చివరిదైన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐదు టీ20లకు క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేదు. మూడు వన్దేలు, టెస్టుల్లో పేలవంగా ఆడి ఓటమినే చవిచూసింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో కూడా ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగో ఓవర్లో కివీస్ ఓపెనర్లు సింగిల్ తీస్తుండగా.. భారత ఫీల్డర్ ‘టూ’ అంటూ అరిచాడు. ఇది విన్న అంపైర్ కెటిల్‌బరో ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే టీమిండియా సారధి కోహ్లీతో మాట్లాడాడు. అలా చేయడం తప్పని హెచ్చరించాడు. అయితే తమ ఫీల్డర్ చేసిన పనిని కోహ్లీ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కివీస్ ఓపెనర్లు రెండో పరుగు తీయడానికి ప్రయత్నిస్తే అప్రమత్తంగా ఉండాలని ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌కు సూచించే ప్రయత్నమే అదని వివరించాడు. కానీ ఈ వివరణను అంపైర్ అంగీకరించలేదు. ‘మీరు టూ అని అరవకూడదు. మీ వివరణ ఆమోదయోగ్యంగా లేదు. మళ్లీ అలా చేయొద్దు’ అని తేల్చిచెప్పాడు. 


Updated Date - 2020-03-02T23:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising