మూడో టెస్టు అక్కడే.. వెల్లడించిన క్రికెట్ ఆస్ట్రేలియా
ABN, First Publish Date - 2020-12-30T12:27:23+05:30
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ర్రారంభమైంది. తొలి మ్యాచులో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా కోలుకొని ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టింది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ర్రారంభమైంది. తొలి మ్యాచులో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా కోలుకొని ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టింది. అనంతరం జరిగే మూడో టెస్టును సిడ్నీలో నిర్వహిస్మున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే సిడ్నీలో ఏదైనా పొరబాటు జరిగితే.. వేదికను మళ్లీ మెల్బోర్న్కే మార్చేస్తారట. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా వెల్లడించారు. మెల్బోర్న్ టెస్టులో ఆసీస్పై భారత జట్టు భారీ విజయం నమోదు చేసిన విషయంల తెలిసిందే. కాగా, సిడ్నీ నగరంలో తాజాగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఇక్కడ మూడో టెస్టు జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి.
Updated Date - 2020-12-30T12:27:23+05:30 IST