ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభావంతులను గుర్తించండి

ABN, First Publish Date - 2020-08-05T09:17:17+05:30

మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు కృషి చేయాలని అధికారులను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు క్రీడా మంత్రి రిజిజు ఆదేశాలు

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు కృషి చేయాలని అధికారులను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ఆదేశించారు. క్రీడా శాఖ కార్యదర్శి రవి మిట్టల్‌, సాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో ఖేలో ఇండియా క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌, యూనివర్సిటీ గేమ్స్‌తో కొంతమంది ప్రతిభావంతులను గుర్తించాం. అయితే, క్రీడా ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా నిలిపేందుకు ఈ ప్రయత్నం సరిపోదు. రాష్ట్రస్థాయిలో కూడా తరచూ క్రీడా పోటీలను నిర్వహించాలి. ఖేలో ఇండియా పథకం ద్వారా పోటీలు నిర్వహించే రాష్ట్రాలకు సాయం అందించాలి’ అని కిరణ్‌ తెలిపారు. 

Updated Date - 2020-08-05T09:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising