ఆలు-ఉల్లి వ్యాపారం చేయగాలేంది.. క్రికెట్ ఎందుకు ఆడకూడదు?
ABN, First Publish Date - 2020-02-19T10:44:42+05:30
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీ్సలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని
- భారత్-పాక్ సిరీ్సపై అక్తర్
కరాచీ: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీ్సలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు తటస్థ వేదికలు సరైనవని పేర్కొన్నాడు. ‘రెండు దేశాలు డేవిస్ కప్ మ్యాచ్లు ఆడతాయి. కబడ్డీ పోటీల్లో తలపడతాయి. ఇరు దేశాలు ఆలుగడ్డలు-ఉల్లిగడ్డల వ్యాపారమూ చేస్తాయి. కానీ క్రికెట్ విషయంలోనే ఎందుకు సమస్య. పరస్పర సంబంధాలు వద్దనుకుంటే వాణిజ్య సంబంధాలను కూడా నిలిపివేయాలి. క్రికెట్కు వచ్చేసరికి రాజకీయం చేయడం ఎంతో నిరాశ కలిగిస్తోంది’ అని అక్తర్ తన యూట్యూబ్ చానెల్లో ఆవేదన వ్యక్తంజేశాడు.
Updated Date - 2020-02-19T10:44:42+05:30 IST