ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరుకు ఇండో-పాక్‌ సిరీస్‌

ABN, First Publish Date - 2020-04-09T10:07:02+05:30

కరోనా మహమ్మారిపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి చిరకాల ప్రత్యర్థులైన ఇండో-పాక్‌ మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి చిరకాల ప్రత్యర్థులైన ఇండో-పాక్‌ మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రతిపాదించాడు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2007 నుంచి భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగలేదు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం దాయాది దేశాల మధ్య మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతున్నా. ఈ సిరీస్‌ ఫలితం గురించి ఇరు దేశాల అభిమానులు నిరాశపడరని భావిస్తున్నాన’ని అక్తర్‌ చెప్పాడు. ఈ సిరీస్‌ ద్వారా సేకరించిన మొత్తాన్ని వైర్‌సపై పోరాడేందుకు ఇరు దేశాలకు సమానంగా విరాళం ఇవ్వాలన్నాడు. ‘విరాట్‌ సెంచరీ కొడితే మేం ఆనందపడతాం. బాబర్‌ ఆజమ్‌ శతకం బాదితే భారత ఫ్యాన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు’ అని షోయబ్‌ అన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌లు జరిగితే ప్రేక్షకుల స్పందన భారీగా ఉంటుందని చెప్పాడు. షాహిద్‌ అఫ్రీది స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయాల్సిందిగా యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ విజ్ఞప్తి చేయడాన్ని కొందరు విమర్శించారు. అలాంటి విమర్శలు చేయడం అమానవీయమని అక్తర్‌ అన్నాడు.

Updated Date - 2020-04-09T10:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising