రూ.80 లక్షలిచ్చిన రోహిత్
ABN, First Publish Date - 2020-04-01T09:58:05+05:30
కరోనాతో పోరుకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన వంతుగా రూ.80 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. ఇందులో ప్రధాని కేర్స్ ఫండ్స్కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు
ముంబై: కరోనాతో పోరుకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన వంతుగా రూ.80 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. ఇందులో ప్రధాని కేర్స్ ఫండ్స్కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు అందించడంతో పాటు వీధి కుక్కలను కాపాడేందుకు కూడా వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ (డబ్ల్యుఎ్సడీ) సంస్థకు రూ.5 లక్షలు ఇస్తున్నట్టు ట్విటర్లో ప్రకటించాడు. అలాగే మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఆ మొత్తం ఎంతనేది కుంబ్లే వెల్లడించలేదు. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ గంగూలీతో పాటు విరాట్ కోహ్లీ, సచిన్, రైనా, గంభీర్, మిథాలీ, పూనమ్, దీప్తి, సింధు, మేరీ కోమ్ తదితరులు కూడా విరాళాలు ప్రకటించిన వారిలో ఉన్నారు.
Updated Date - 2020-04-01T09:58:05+05:30 IST