వన్డేల్లో డబుల్ సెంచరీ కలలో కూడా ఊహించలేదు: రోహిత్
ABN, First Publish Date - 2020-05-19T23:28:46+05:30
ప్రపంచ క్రికెట్లో మూడుసార్లు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
ముంబై: ప్రపంచ క్రికెట్లో మూడుసార్లు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. జీవితంలో ఎప్పుడూ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధిస్తానని తాను ఊహించలేదని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్ సందర్భంగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2013లో తొలిసారి ఆస్ట్రేలియాపై డబుల్ సాధించిన రోహిత్.. ఆ అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ‘ఆ మ్యాచ్లో ధవన్, కోహ్లీ తక్కువ పరుగులకే అవుటయ్యారు. కావున మ్యాచ్ గెలవాలంటే నేను కచ్చితంగా భారీస్కోర్ చేయాలి. అది నా బాధ్యతగా భావించా’ అని చెప్పాడు. కాగా, వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మే.
Updated Date - 2020-05-19T23:28:46+05:30 IST