ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌరాష్ట్ర 226/6

ABN, First Publish Date - 2020-02-21T10:05:24+05:30

సౌరాష్ట్రతో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ పోరులో తొలిరోజు ఆంధ్ర బౌలర్‌ ఎర్రా పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రతో రంజీ క్వార్టర్స్‌

ఒంగోలు (ఆంధ్రజ్యోతి): సౌరాష్ట్రతో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ పోరులో తొలిరోజు ఆంధ్ర బౌలర్‌ ఎర్రా పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు లెఫ్టామ్‌ మీడియం పేసర్‌ పృథ్వీరాజ్‌ (3/51) మూడు వికెట్లతో విజృంభించాడు. పృథ్వీకితోడు మరో బౌలర్‌ కేవీ శశికాంత్‌ (2/82) రెండు వికెట్లు పడగొట్టడంతో తొలిరోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 226/6 స్కోరు చేసింది. మరో వికెట్‌ను స్టీఫెన్‌ తీశాడు. సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌లో విశ్వరాజ్‌సింగ్‌ జడేజా (73), చిరాగ్‌ జాని (53 బ్యాటింగ్‌), షెల్డన్‌ జాక్సన్‌ (50) అర్ధసెంచరీలు చేశారు. ఓపెనర్‌ కిషన్‌ పర్మార్‌ 35 పరుగులు చేశాడు. క్రీజులో జానికి అండగా మన్కడ్‌ (0 బ్యాటింగ్‌) ఉన్నాడు. 

మిగతా క్వార్టర్స్‌ తొలిరోజు స్కోర్లు: బెంగాల్‌ 308/6 (విదర్భతో), గుజరాత్‌ 330/4 (గోవాతో), కర్ణాటక 142/6 (జమ్మూ కశ్మీర్‌తో).

Updated Date - 2020-02-21T10:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising