ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ

ABN, First Publish Date - 2020-08-20T20:10:57+05:30

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ధోనీకి ప్రధాని మోదీ లేఖ రాశారు. ధోనీ ప్రకటించిన రిటైర్మెంట్ గురించి దేశం మొత్తం చర్చించుకుందని మోదీ పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఈ నిర్ణయం పట్ల నిరాశ చెందారని.. అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని మోదీ లేఖలో తెలిపారు. ధోనీ ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలిచాడని మోదీ కొనియాడారు.


గడ్డు పరిస్థితుల్లో కూడా తీవ్ర ఒత్తిడిని తట్టుకుని నిలబడిన ధోనీ... ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాడని ప్రధాని లేఖలో ప్రస్తావించారు. 2007 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ అందుకు నిజమైన ఉదాహరణ అని మోదీ గుర్తుచేశారు. క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ధోనీ పేరు చిరస్థాయిలో నిలిచి ఉంటుందని చెప్పారు. సాక్షి, జీవాలతో మరింత సమయం గడుపుతావని ఆశిస్తున్నట్లు ధోనీని ఉద్దేశించి మోదీ లేఖలో రాశారు. ధోనీ భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 



Updated Date - 2020-08-20T20:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising