అహ్మదాబాద్లో పింక్ బాల్ టెస్ట్
ABN, First Publish Date - 2020-10-21T08:45:40+05:30
అహ్మదాబాద్లో పింక్ బాల్ టెస్ట్
కోల్కతా: వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా అహ్మదాబాద్లో డే/నైట్ టెస్ట్ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. జనవరి నుంచి మార్చి వరకు జరిగే ఈ పర్యటనలో ఐదు టెస్ట్లు, పరిమిత ఓవర్ల సిరీస్ల్లో టీమిండియాతో ఇంగ్లండ్ తలపడనుంది. అహ్మదాబాద్లో పింక్ బాల్ టెస్ట్ జరుగుతుందని మంగళవారమిక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంగూలీ తెలిపాడు. అయితే, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో టీమ్ సెలెక్షన్ ఉంటుందని సౌరవ్ చెప్పాడు. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో రంజీ ట్రోఫీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాడు.
Updated Date - 2020-10-21T08:45:40+05:30 IST