ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్, ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేవారున్నారు.. కానీ ధోనీ అలా కాదు: కైఫ్

ABN, First Publish Date - 2020-05-21T23:22:32+05:30

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ధోనీ విషయంలో తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని.. టీం ఇండియా ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నారు. 


ఈ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ.. ధోనీ స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ‘‘అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. కేఎల్ రాహుల్ సుదీర్ఘంగా వికెట్‌ కీపర్‌గా ఉండలేడు. ఇకవేళ కీపర్ గాయపడితే.. రాహుల్‌ని ఆ స్థానంలో ఆడించవచ్చు. ఇక సంజూ శాంసన్, రిషబ్‌ పంత్‌లు కూడా ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరు. సచిన్, ద్రవిడ్‌లు రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీని కోహ్లీ, రోహిత్, రహానే, పుజారాలు భర్తీ చేశారు. కానీ ధోనీ విషయంలో అలా జరగదని నాకు అనిపిస్తుంది. అతని లాంటి వికెట్‌ కీపర్ మరొకరు ఉండరు. కాబట్టి అతన్ని తొందరపాటులో పక్కన పెట్టవద్దు’’ అని కైఫ్ తెలిపారు. 

Updated Date - 2020-05-21T23:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising