ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన ఘనత సాధించిన మనీశ్ పాండే..

ABN, First Publish Date - 2020-02-02T02:52:34+05:30

అరుదైన ఘనత సాధించిన మనీశ్ పాండే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే ఓ అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో వెస్ట్ ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మనీశ్ అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాక.. అతను ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. అయితే నిన్నటి మ్యాచ్‌లో మాత్రమే కాదు.. మనీశ్ ఆడిన గత ఆరు టీ-20ల్లోనూ అతను నాటౌట్‌గానే ఉన్నాడు. ఆరు మ్యాచుల్లో కలిపి అతను మొత్తం 133 పరుగులు చేశాడు. ఇందులో శుక్రవారం చేసిన 50(36) అత్యధిక స్కోర్ కావడం మరో విశేషం. చివరిగా ఆగస్టు 4, 2019న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీశ్ ఔట్ అయ్యాడు. 


కాగా, నిన్నటి మ్యాచ్‌లో జట్టు విజయంలో మనీశ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ జట్టుకు తను అండగా నిలిచాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కూడా 165 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించగా అందులో భారత్ విజయం సాధించి.. సిరీస్‌లో 4-0 తేడాతో ఆధిక్యం సాధించింది. 

Updated Date - 2020-02-02T02:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising