ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ జట్టులో మళ్ళీ స్థానం సంపాదిస్తా: అమిత్ మిశ్రా

ABN, First Publish Date - 2020-08-07T21:26:22+05:30

భారత జట్టులో తిరిగి స్థానాన్ని సంపాదించుకుంటానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. మరి కొన్ని వారాల్లోనే ఐపీఎల్-2020 ప్రారంభం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత జట్టులో తిరిగి స్థానాన్ని సంపాదించుకుంటానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. మరి కొన్ని వారాల్లోనే ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులో తన స్థానంపై మాట్లాడాడు. కేవలం ఐపీఎల్ ఆడటానికి మాత్రమే తాను ప్రాక్టీస్ చేయట్లేదని, జాతీయ జట్టులో స్థానం కోసమే శ్రమిస్తున్నానని చెప్పాడు. ‘నేను ఎప్పుడూ నాతో పోరాడుతూనే ఉంటాను. జాతీయ జట్టులో స్థానాన్ని ఎలాగైనా తిరిగి సంపాందించాలనేదే నా కోరిక. ఎప్పటికైనా మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక కాగలననే నమ్మకం ఉంది. దానికి సిద్ధంగా ఉండేందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నాను. కేవలం ఐపీఎల్ ఆడటం నా లక్షం కాదు. జాతీయ స్థాయిలో రాణించడమే నా లక్షమ’ని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మిశ్రా చివరిగా 2017 ఫిబ్రవరిలో భారత్ తరుపున టీ20 ఆడాడు. 2016లో చివరిగా టెస్ట్‌లలో కనిపించాడు. అప్పటి నుంచి మిశ్రా భారత జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Updated Date - 2020-08-07T21:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising