టాప్లో భారత అమ్మాయిలు
ABN, First Publish Date - 2020-10-18T09:14:42+05:30
తమిళ గ్రాండ్మాస్టర్ ఆర్.వైశాలి అద్భుతమైన ఆటతీరుతో ఆసియా ఆన్లైన్ టీమ్ చెస్లో భారత్ దూసుకుపోతోంది. ఆరోరౌండ్ ముగిసేసరికి ఫిలిప్పీన్స్తో కలిసి..
ఆసియా ఆన్లైన్ టీమ్ చెస్
చెన్నై: తమిళ గ్రాండ్మాస్టర్ ఆర్.వైశాలి అద్భుతమైన ఆటతీరుతో ఆసియా ఆన్లైన్ టీమ్ చెస్లో భారత్ దూసుకుపోతోంది. ఆరోరౌండ్ ముగిసేసరికి ఫిలిప్పీన్స్తో కలిసి భారత మహిళల జట్టు 10పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అంతకుముందు 8వ స్థానంలో ఉన్న భారత్ శనివారం జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవడంతో అగ్రస్థానానికి ఎగబాకింది. నాలుగో రౌండ్లో మయన్మార్పై, ఐదో రౌండ్లో సింగపూర్పై, ఆరో రౌండ్లో ఇండోనేషియాపై భారత్ విజయాలు సాధించింది. లీగ్ దశ ముగిసేసరికి టాప్-8లో ఉన్న జట్లు క్వార్టర్స్ చేరతాయి. ఈనెల 25న టోర్నీ ఫైనల్ జరగనుంది.
Updated Date - 2020-10-18T09:14:42+05:30 IST