ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాండేజీ అచ్చం నాలాగే ఆడాడు: సెహ్వాగ్

ABN, First Publish Date - 2020-10-23T22:29:30+05:30

47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి దెబ్బకు హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి దెబ్బకు హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది.


మనీష్ పాండే బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించాడు. అతడు అచ్చం తనలాగే ఆడాడని ప్రశంసించాడు. రాజస్థాన్‌ను కకావికలు చేశాడని అన్నాడు. హైదరాబాద్ తన బ్యాటింగుతో రాజస్థాన్‌తో డ్యాన్స్ చేయించిందని, వాళ్లను తోలుబొమ్మల్లా ఆడించిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తోలుబొమ్మలాట చాలా బాగుందని అన్నాడు. ‘‘పాండేజీ అచ్చం నాలాగే ఆడాడు. రాజస్థాన్‌ను ధ్వంసం చేశాడు’’ అని మనీష్‌పై ప్రశంసలు గుప్పించాడు.

Updated Date - 2020-10-23T22:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising