ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీకి శాస్త్రి చెప్పుండాల్సింది

ABN, First Publish Date - 2020-12-03T09:44:42+05:30

ఇటీవల రోహిత్‌ శర్మ గాయం అంశం ఎంత వివాదానికి దారి తీసిందో గుర్తుందిగా! రోహిత్‌కు గాయంపై తనకు సమాచారమే లేదని కెప్టెన్‌ కోహ్లీ ఆ మధ్య మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోహిత్‌ గాయం వివాదంపై గంభీర్‌


న్యూఢిల్లీ: ఇటీవల రోహిత్‌ శర్మ గాయం అంశం ఎంత వివాదానికి దారి తీసిందో గుర్తుందిగా! రోహిత్‌కు గాయంపై తనకు సమాచారమే లేదని కెప్టెన్‌ కోహ్లీ ఆ మధ్య మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో కెప్టెన్‌ కోహ్లీకి జట్టు చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సమాచారమిచ్చి ఉండాల్సిందని అన్నాడు. ‘రోహిత్‌ గాయం విషయమై స్పష్టత కొరవడిందంటూ విరాట్‌ కోహ్లీ మీడియా ముందు వ్యాఖ్యానించాడంటే సమాచారలోపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఉదంతంలో జట్టు చీఫ్‌ ఫిజియో, చీఫ్‌ కోచ్‌, సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌దే ప్రధాన బాధ్యత. రోహిత్‌ గాయం గురించి ఈ ముగ్గురికీ తెలుసుంటుంది. అప్పుడు కోచ్‌ హోదాలో శాస్త్రి.. కెప్టెన్‌కు కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. జట్టులో ఓ కీలక ఆటగాడి పరిస్థితి ఎలా ఉంది? అతనికేమైంది? లాంటి అంశాలేవీ చర్చకు రాకపోవడం మంచి పరిణామం కాదు’ అని గంభీర్‌ అన్నాడు.

Updated Date - 2020-12-03T09:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising