ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ఆటగాడి ఫొటోను బ్లర్ చేసి పోస్టు చేసిన గంగూలీ

ABN, First Publish Date - 2020-09-18T01:18:07+05:30

ఈ నెల 19 నుంచి యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: ఈ నెల 19 నుంచి యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గతవారం దుబాయ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం క్వారంటైన్ ముగించుకున్న అనంతరం కొవిడ్ టెస్టు కూడా చేయించుకున్న గంగూలీ.. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, ఐపీఎల్ మాజీ చీఫ్ రాజీవ్ శుక్లా, సీఈవో హేమాంగ్ అమిన్‌, స్థానిక క్రికెట్ బోర్డు అధికారులతో కలిసి ఐపీఎల్ వేదికల్లో ఒకటైన షార్జా క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు.  


అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన గంగూలీ.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వాటిలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఫొటో వెనక ఉన్న ఓ హోర్డింగ్ బ్లర్ చేసి ఉంది. ఆ హోర్డింగ్‌లో ఉన్నది పాకిస్థాన్ ఆటగాడని తెలుస్తున్నా, అతడెవరన్నది మాత్రం గుర్తుపట్టలేనంతగా బ్లర్ చేసి ఉంది. దీంతో ఇప్పుడీ విషయం వైరల్ అయింది.

Updated Date - 2020-09-18T01:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising