ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగూలీ, రొనాల్డో దాతృత్వం

ABN, First Publish Date - 2020-03-26T09:45:33+05:30

కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రీడాకారులు ఒక్కొక్కరుగా ముం దుకు వస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రీడాకారులు ఒక్కొక్కరుగా ముం దుకు వస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాడు. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తమ దేశంలోని రెండు ఆస్పత్రులకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌ (ఐసీయూ)ను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి రూ.7.70 కోట్లను విరాళంగా ఇచ్చాడు. కరోనాపై సమష్టిగా పోరాడాలని..ప్రమాదంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఫెడరర్‌ కోరాడు.


ఈడెన్‌ గార్డెన్స్‌ను ఉపయోగించుకోండి

 ప్రభుత్వం కోరితే ఐసోలేషన్‌ సెంటర్‌గా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియాన్ని ఉపయోగించుకోవడానికి తక్షణమే ఇస్తామని సౌరవ్‌ గంగూలీ  తెలియజేశాడు. ఆటగాళ్ల గదులతో పాటు స్టేడియంలోని డార్మెటరీని వినియోగించుకోవచ్చునని సూ చించాడు. గంగూలీ దారిలోనే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, పుదుచ్చేరి క్రికెట్‌ సంఘం కూడా తమ స్టేడియాలను ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చునని తెలిపాయి.


Updated Date - 2020-03-26T09:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising