ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాచ్‌లో పిడుగుపాటు ఫుట్‌బాలర్‌ మృతి

ABN, First Publish Date - 2020-09-20T09:06:48+05:30

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా పిడుగుపడి ఓ ఆటగాడు మరణించిన విషాద ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా పిడుగుపడి ఓ ఆటగాడు మరణించిన విషాద ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. రాంచీకి 120 కి.మీ. దూరంలో మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామం ఉరుబార్డి. ఇక్కడ గురువారం మధ్యాహ్నం జరిగిన నెమాన్‌ కుజుర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మ్యాచ్‌ జరిగింది. పోటీ మధ్యలో వర్షం మొదలైనా మ్యాచ్‌ను కొనసాగించారు. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో పరాస్‌ పన్నా అనే యువ ఆటగాడితోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వీరిని గుమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..పరాస్‌ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం గురించి శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్‌ నిర్వహించడంపై విచారణ జరుపుతున్నట్టు చైన్‌పూర్‌ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి కుల్దీప్‌ కుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-09-20T09:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising