టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ABN, First Publish Date - 2020-12-04T19:09:41+05:30
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఓటమి తర్వాత పొట్టి ఫార్మాట్లో తలపడుతోంది టీమిండియా. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఫించ్ ముందుగా టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్కు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్.. ధావన్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. తుది జట్టులో మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్లకు చోటు దక్కింది.
Updated Date - 2020-12-04T19:09:41+05:30 IST