ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 కిలో మీటర్లు..749 మంది రన్నర్లు!

ABN, First Publish Date - 2020-04-10T09:37:33+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో నుంచి కదల్లేని పరిస్థితి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడే ‘హోమ్‌ మారథాన్‌’

దుబాయ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో నుంచి కదల్లేని పరిస్థితి. కాలు కదపకుండా ఇళ్లల్లోనే ఉండడం ఫిట్‌నెస్‌ ప్రేమికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇందులోంచి పుట్టిందే ‘మారథాన్‌ ఎట్‌ హోమ్‌’. శుక్రవారం నిర్వహించ నున్న ఈ వినూత్న మారథాన్‌లో 62 దేశాలకు చెందిన 749 రన్నర్లు పాల్గొననున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు.. అంటే 10 గంటలపాటు మారథాన్‌ సాగనుంది. ఇందులో భాగంగా రన్నర్లు తమ ఇంట్లోనే 42.196 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, మిడిల్‌ ఈస్ట్‌ రన్‌ క్లబ్‌ కలిసి ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ మారథాన్‌లో పాల్గొనాలనుకునే వారు నిర్వాహకులు సూచించిన స్ట్రావా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. టాప్‌లో నిలిచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. 

Updated Date - 2020-04-10T09:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising