ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో వరల్డ్‌కప్‌కు వీసాలపై భరోసా ఇవ్వండి

ABN, First Publish Date - 2020-10-20T09:08:08+05:30

దాయాదుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. వచ్చేఏడాది అక్టోబరులో భారత్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పకు సంబంధించిన వీసాల విషయంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీని కోరిన పాక్‌ 



న్యూఢిల్లీ: దాయాదుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. వచ్చేఏడాది అక్టోబరులో భారత్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పకు సంబంధించిన వీసాల విషయంలో ఐసీసీ హామీని పాకిస్థాన్‌ కోరుకుంటోంది. ఇదే విషయమై జనవరి కల్లా స్పష్టత ఇవ్వాలని ఐసీసీని అడిగినట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సీఈవో వసీం ఖాన్‌ చెప్పాడు. ‘టోర్నీలో పాల్గొనే జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి వీసాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆతిథ్య దేశానిదే. అందుకే ఐసీసీకి మా ఆందోళనను వ్యక్తపరిచాం’ అని వసీం తెలిపాడు. ఈ విషయంపై బీసీసీఐతో ఐసీసీ చర్చిస్తుందన్నాడు. ఈ మధ్య కాలంలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న గ్లోబల్‌ టోర్నీల్లో పాక్‌ అథ్లెట్ల వీసాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-10-20T09:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising