ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విధానంతో ఆటగాళ్ల భద్రతకు భరోసా లేదు: ద్రావిడ్

ABN, First Publish Date - 2020-05-27T02:17:55+05:30

కరోనా నేపథ్యంలో క్రికెట్‌ పూర్తిగా మూలన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రీడను పునరుద్ధరించేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో క్రికెట్‌ పూర్తిగా మూలన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రీడను పునరుద్ధరించేందుకు పలు దేశాల క్రికెట్ బోర్డులు అనేక విధానాలను ముందుకు తీసుకొస్తున్నాయి. వాటిలో ఒకటి బయో బబుల్ విధానం. దీని ప్రకారం.. మ్యాచ్ ఆడే ఆటగాళ్లను నిర్ణీత కాలం ముందుగానే క్వారంటైన్ చేస్తారు. వారిని హై సెక్యూరిటీలో ఉంచి మ్యాచ్ రోజున గ్రౌండ్‌కు పంపిస్తారు. అయితే ఈ విధానంపై భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ పెదవి విరిచారు. ఈ విధానం అంత గొప్పగా  ఏం లేదని, ఇది ఆచరణలో అంత ఫలితాన్ని చూపదని పేర్కొన్నారు.


‘ఆటగాళ్లను క్వారంటైన్ చేసి వారిని పూర్తి సెక్యూరిటీలో ఉంచడం సరే. ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు రెండో రోజు ఆట తరువాత ఎవరైనా  ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే పరిస్థితేంటి..? దీని వల్ల ఆ టెస్టే కాదు పూర్తిగా సిరీస్ నిర్వహణే అకస్మాత్తుగా ముగిసిపోతుంది. అంతే కాకుండా అలాంటి పరిస్థితుల్లో మిగతా ఆటగాళ్ల భద్రత కూడా కష్టమవుతుంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-05-27T02:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising