కోహ్లీ వర్సెస్ రాహుల్.. గేల్ రాకతో ఫుల్ జోష్లో పంజాబ్
ABN, First Publish Date - 2020-10-16T00:46:36+05:30
ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరగనున్న మ్యాచ్లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్
షార్జా: ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరగనున్న మ్యాచ్లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్లోనూ తన విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తుండగా, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.
బెంగళూరు జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా, పంజాబ్ మాత్రం జట్టులో మూడు మార్పులు చేసింది. గాయపడిన మన్దీప్తోపాటు ప్రభ్సిమ్రన్, ముజీబ్లు బెంచ్కు పరిమితం కాగా, ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న గేల్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే, హూడా, అశ్విన్ జట్టులోకి వచ్చారు. గేల్ రాకతో జట్టులో జోష్ పెరిగింది. గేల్ ఆటకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు నేడు టీవీలకు అతుక్కుపోవడం ఖాయం.
Updated Date - 2020-10-16T00:46:36+05:30 IST