ముంబై వర్సెస్ పంజాబ్: సూపర్ ఓవర్ కూడా టై
ABN, First Publish Date - 2020-10-19T05:28:57+05:30
ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా టై అవడంతో మ్యాచ్ మరింత
దుబాయి: ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా టై అవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. రెండు జట్లు 176 పరుగులు చేయడంతో మ్యాచ్ మొదట టై అయింది. ఇక గెలుపు కోసం రెండు జట్లు సూపర్ ఓవర్కు దిగాయి. సూపర్ ఓవర్లో పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయి ఐదు పరుగులు చేసి ముంబైకు ఆరు పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే ముంబై ఆరు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేయడంతో మరోసారి మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ మరో సూపర్ ఓవర్కు దారితీసింది.
Updated Date - 2020-10-19T05:28:57+05:30 IST