ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎఫ్‌సీ ఆసియా కప్‌-2027కు భారత్‌ బిడ్‌ దాఖలు

ABN, First Publish Date - 2020-04-06T09:32:41+05:30

భారత్‌ మరో మెగా ఈవెంట్‌ ఆతిథ్యానికి సై అంటోంది. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌-2027 పురుషుల టోర్నీకి బిడ్‌ దాఖలు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌ మరో మెగా ఈవెంట్‌ ఆతిథ్యానికి సై అంటోంది. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌-2027 పురుషుల టోర్నీకి బిడ్‌ దాఖలు చేసింది. బిడ్‌కు సంబంధించిన పత్రాలను నిర్వాహక ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ (ఏఎఫ్‌సీ)కు అధికారికంగా అందజేసినట్టు ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ ఆదివారం వెల్లడించారు. బిడ్‌ గెలిస్తే.. ఈ ఖండాంతర మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వడం తొలిసారి కానుంది. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఏఎఫ్‌సీ కప్‌కు నిరుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆతిథ్యమివ్వగా.. 2023 టోర్నీ చైనాలో జరగనుంది. కాగా.. 2027 ఆతిథ్య హక్కులను ఎవరు గెలుచుకున్నారన్నది ఏఎఫ్‌సీ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటించనుంది. 2022లో జరిగే మహిళల ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులను ఇప్పటికే భారత్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-04-06T09:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising