ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లొంగుబాటు

ABN, First Publish Date - 2020-09-28T12:24:49+05:30

ఓ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ మెడలో ప్లకార్డు వేసుకొని ఏకంగా పోలీసుస్టేషనుకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): ఓ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ మెడలో ప్లకార్డు వేసుకొని ఏకంగా పోలీసుస్టేషనుకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ పోలీసుస్టేషనులో జరిగింది.సంభాల్ పట్టణానికి చెందిన నయీం అనే వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెడలో నన్ను కాల్చి చంపొద్దు అంటూ ప్లకార్డు వేసుకొని సంభాల్ పట్టణంలోని నఖాసా పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. ‘‘నేను చాలా తప్పులు చేశాను. సంభాల్ పోలీసులంటే నాకెంతో భయం...అందుకే నేను చేసిన తప్పులను అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోతున్నాను..నన్ను కాల్చి చంపొద్దు ప్లీజ్’’ అంటూ నయీం ప్లకార్డులో రాశారు. 


గ్యాంగ్‌స్టర్ నయీంపై గ్యాంగ్‌స్టర్ యాక్టు కింద కేసు నమోదు చేశామని స్టేషన్ హౌస్ ఆఫీసరు ధర్మపాల్ సింగ్ చెప్పారు. గ్యాంగ్‌స్టర్ నయీం తమ పోలీసుస్టేషనులో లొంగిపోయాడని సంభాల్ పోలీసులు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-09-28T12:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising