ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ఉల్లి చోరీ... 550 కిలోలు మాయం!

ABN, First Publish Date - 2020-10-24T16:31:10+05:30

దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ చేరుకునే పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ చేరుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతినిత్యం ఉల్లిని తప్పనిసరిగా వినియోగించే వారంతా... ఉల్లిని తరగకుండానే కన్నీరు పెట్టుకుంటున్నారు. 


ఉల్లి ధరలు అమాంతం పెరిగిన నేపధ్యంలో ఉల్లి బస్తాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పూణెలో గల ఒక గోదాములో నిల్వ ఉంచిన 550 కిలోల ఉల్లి చోరీకి గురయ్యింది. ఈ ఉదంతంలో ఒక దొంగను అదుపులోనికి తీసుకోగా, మరొక దొంగ పరారయ్యాడు. ఈ ఘటన పూణె పరిధిలోని దేవజలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోకి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు గోదాములోని 38 బస్తాల ఉల్లిని చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిని గమనించిన ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారన్నారు. వారంతా కలసి ఒక దొంగను పట్టుకోగా, మరొక దొంగ అక్కడి నుంచి పారిపోయాడన్నారు. 10 బస్తాల ఉల్లి మాయమైందని తెలిపారు. 


Updated Date - 2020-10-24T16:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising