ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ మాల‌లతో మంత్రికి స్వాగ‌తం.... శానిటైజ‌ర్ల పంపిణీ!

ABN, First Publish Date - 2020-07-11T16:48:05+05:30

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజెపీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత‌నికి మాస్క్ మాల‌ల‌తో స్వాగతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాలియ‌ర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజెపీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత‌నికి మాస్క్ మాల‌ల‌తో స్వాగతం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌ద్ద‌తుదారులు అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు మాస్క్‌ల‌ను, శానిటైజ‌ర్ల‌ను పంపిణీ చేశారు. త‌రువాత మంత్రి  ప్రద్యుమాన్ సింగ్ దివంగత మాధవరావు సింధియా విగ్రహానికి పూల‌మాల వేశారు. అంతకుముందు గాంధీ సర్క్యూట్ రోడ్ హౌస్‌కు చేరుకుని సింధియా మద్దతుదారులను కలిశారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న కొంతమంది తల్లిదండ్రులు... విద్యార్థుల ఫీజుల విష‌యంలో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న‌ ఒత్తిడిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం అంద‌రి ఆర్థిక ప‌రిస్థితులు కుదేల‌య్యాయ‌ని, ఇటువంటి  ప‌రిస్థితిలో త‌మ పిల్ల‌ల స్కూలు ఫీజుల క‌ట్ట‌లేమ‌ని మంత్రికి మొర‌పెట్టుకున్నారు. 


Updated Date - 2020-07-11T16:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising