ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మందిరంలో రోజూ రెండు పూటలా 2 వేల మందికి భోజనం

ABN, First Publish Date - 2020-09-07T14:26:40+05:30

కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకామ్ మహాదేవ్ మందిరం దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ మందిరంలో కొన్ని దశాబ్ధాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆలయంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొట్టాయం: కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకామ్ మహాదేవ్ మందిరం దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ మందిరంలో కొన్ని దశాబ్ధాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆలయంలోని వంటగదిలో ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండు వేల మంది భక్తుల కోసం భోజనం సిద్ధం చేస్తారు. ఏ సమయంలో వచ్చినా ఆలయంలో భక్తులకు భోజనం సిద్ధంగా ఉంటుంది.


లాక్‌డౌన్ సమయంలోనూ ఆలయం తరపున ఆహార వితరణ కార్యక్రమం కొనసాగింది. కేరళలోని కొన్ని ఆలయాల్లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆహారాన్ని అందించే కార్యక్రమం జరుగుతుంటుంది. అలాంటివాటిలో తిరువనంతపురంలోని ప్రముఖ పద్మనాభస్వామి ఆలయం ఒకటి. కాగా 108 సంవత్సరాలుగా వైకామ్ మహాదేవ్ మందిరంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్సవాల సమయంలో ఈ మందిరంలో 3,600 కిలోల బియ్యంతో అన్నం వండుతారు. ఈ భోజనశాలలో 16 నాయర్ కుటుంబాలకు చెందినవారు కొన్ని తరాలుగా సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2020-09-07T14:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising