పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయగీతాలపై హోమ్వర్క్... విచారణకు దిగిన అధికారులు!
ABN, First Publish Date - 2020-07-13T14:10:41+05:30
జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కిండర్ గార్టెన్ విద్యార్థులను పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కంఠస్థం చేయమని కోరాడు. ఇది వివాదానికి దారితీసింది.
జమ్షడ్పూర్: జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కిండర్ గార్టెన్ విద్యార్థులను పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కంఠస్థం చేయమని కోరాడు. ఇది వివాదానికి దారితీసింది. ఆ ఉపాధ్యాయుడికి దేశ వ్యతిరేక మనస్తత్వం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో దీనిపై విచారణకు విద్యాశాఖాధికారులు రంగంలోకి దిగారు. ఆ ఉపాధ్యాయుడు ఒక సామాజిక వర్గానికి చెందినవాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఆన్లైన్ తరగతులలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను నేర్చుకోవాలని పాఠశాల వాట్సాప్ గ్రూపులో యూట్యూబ్ లింక్ ఇస్తూ కోరాడు. అయితే దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి శివేంద్ర కుమార్ మాట్లాడుతూ బీజేపీ అధికార ప్రతినిధి కునాల్ సారంగి కూడా ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారన్నారు. దీంతో ఇద్దరు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, నివేదిక సమర్పించాలని కోరామని తెలిపారు.
Updated Date - 2020-07-13T14:10:41+05:30 IST