ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లముందు పుర్రెలు, ఎముకలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

ABN, First Publish Date - 2020-08-08T04:16:51+05:30

తమిళనాడులోని పళని జిల్లాలో ఇళ్లముందు ఎముకలు, పుర్రెలు కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. స్థానిక దేవనగర్ వీధిలో ఈ ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని పళని జిల్లాలో ఇళ్లముందు ఎముకలు, పుర్రెలు కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. స్థానిక దేవనగర్ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు మూడు ఇళ్లు, ఒక దుకాణం ఎదురుగా ఈ పుర్రెలు, ఎముకలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వీటిని ఇనుప తీగతో కట్టి ఇళ్లముందు విడిచిపెట్టి వెళ్లారు. వీటిపై కుంకుమ, పసుపు కూడా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడకు చేరుకున్ అధికారులు ఆ పుర్రెలను తొలగించి చుట్టుపక్కలవారిని విచారించారు. అయితే ఎవరూ ఇళ్లబయట లేకపోవడంతో ఈ పని ఎవరు చేశారో తెలియరాలేదు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తామని వివరించారు. అయితే ఇటీవల కొంత మంది యువకులు మద్యం తాగి రోడ్లపై తిరుగుతుండడంతో స్థానికులు తమకు ఫిర్యాదు చేశారని, ఆ కోపంతో వారే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-08T04:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising