ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దటీజ్ న్యూజిలాండ్.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్న ఫొటోలు!

ABN, First Publish Date - 2020-10-14T00:54:40+05:30

కరోనాను జయించిన న్యూజిలాండ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లెడిస్లో కప్ టెస్ట్ మ్యాచ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్: కరోనాను జయించిన న్యూజిలాండ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లెడిస్లో కప్ టెస్ట్ మ్యాచ్‌కు జనాలు పోటెత్తారు. ఇసుక పోస్తే రాలనంతమంది హాజరయ్యారు. వెల్లింగ్టన్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ రగ్బీ మ్యాచ్‌కు ఏకంగా 30 వేల మందికి పైగా హాజరయ్యారు.


వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫేస్ మాస్కులు ధరించకపోవడం విశేషం. కరోనా మహమ్మారి తర్వాత ఓ స్టేడియంలో మాస్కులు లేకుండా ప్రేక్షకులు కనిపించడం ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారిలో ఏ ఒక్కరు మాస్కు ధరించకపోగా, భౌతిక దూరం కూడా పాటించలేదు.   


అదే సమయంలో యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్ 2020) మ్యాచ్‌లు మాత్రం ప్రేక్షకులు లేకుండానే బయో సెక్యూర్ బబుల్ మధ్య జరుగుతున్నాయి. అలాగే, ఫ్లోరిడాలో జరుగుతున్న నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వైరల్ అవుతున్న న్యూజిలాండ్ ఫొటోలు కరోనా ముందు నాటి పరిస్థితులను కళ్లను కడుతున్నాయి. 


ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరు ప్రధాని జెసిండా అర్డెర్న్‌ను ప్రశంసిస్తున్నారు. కొవిడ్ మహమ్మారిని ఆమె ఎదుర్కొన్న తీరును, వైరస్‌ను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తున్నారు. ‘‘వారెందు మాస్కులు ధరించలేదు. (ఓహో, అది న్యూజిలాండ్ కదా)’’ అని ఓ యూజర్ రాస్తే, అమెరికా వాళ్లు తమ ఎన్ఎఫ్ఎల్ మ్యాచ్‌లను ఇంట్లో కూర్చుని చూస్తున్నారని, న్యూజిలాండ్ మాత్రం ఇలా జరిగిందని మరో యూజర్ కామెంట్ చేశాడు.  


కరోనా వైరస్‌ను న్యూజిలాండ్ రెండుసార్లు తరిమికొట్టింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి ఈ ఏడాది మేలో వైరస్‌ను అక్కడి ప్రభుత్వం నిర్మూలించింది. అయితే, ఆగస్టులో ఆక్లాండ్‌లో కొన్ని కేసులు మళ్లీ వెలుగుచూశాయి. దీంతో అక్కడ మూడు వారాలు లాక్‌డౌన్ విధించారు. అక్కడ మళ్లీ వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో ఈ నెల 5న ప్రధాని జెసిండా ఈ విషయాన్ని నిర్ధారించారు. కరోనా నియంత్రణలోనే ఉందని తెలిపారు.  


 50 లక్షల మంది జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో 25 మంది మాత్రమే కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 1,872 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం 39 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలను బట్టి తెలుస్తోంది. 


Updated Date - 2020-10-14T00:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising