ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో వ‌ల‌స కూలీల బ‌స‌... ఎండిన రొట్టెలే ఆహారం!

ABN, First Publish Date - 2020-05-27T12:57:32+05:30

ఒక వైపు క‌రోనా మహమ్మారి, మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మ‌కులు అనేక అవ‌స్థ‌ల‌కు లోన‌వుతున్నారు. మండే ఎండ‌ల్లో చురుక్కుమ‌నే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వైపు క‌రోనా మహమ్మారి, మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మ‌కులు అనేక అవ‌స్థ‌ల‌కు లోన‌వుతున్నారు. మండే ఎండ‌ల్లో చురుక్కుమ‌నే రోడ్ల‌పై న‌డుస్తుండ‌టంతో వారి పాదాలకు బొబ్బలెక్కిపోతున్నాయి. మ‌రోవైపు రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఇంతేకాదు ఏదో ఒక లారీ ఎక్కి ప్ర‌మాదాల‌కు గురై ప్రాణాలు కోల్పోతున్న‌వారు కూడా ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో వ‌ల‌స కార్మికుల బ‌స‌కు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. కోట నాకా అని పిలిచే  ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని శివపురి సరిహద్దును, రాజస్థాన్‌లోని బాన్రా జిల్లాను కలుపుతుంది. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లలో వలస కూలీలకు వసతి సౌక‌ర్యం కల్పించారు. దీంతో మ‌రోమార్గం లేక  ఇక్క‌డే ఉంటున్నారు. ప్రభుత్వం పంపించే ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే ఆ ఆహారం చెడిపోతున్న‌ద‌ని, ఎండిన రొట్టెలు పంపిస్తున్నార‌ని వారు త‌ర‌చూ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తున్నా ఫ‌లితం లేక‌పోతోంది. 


Updated Date - 2020-05-27T12:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising