ఫుట్పాత్పై నివాసముంటున్న బాలికకు పదిలో 80.4% మార్కులు
ABN, First Publish Date - 2020-07-13T23:56:59+05:30
కాగా, విద్యార్థినిని కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ ప్రశంసించారు. ప్రతిభకు ఏదీ అడ్డం కాదని, అసాధ్యమైనదేదీ లేదని కొనియాడారు. ‘‘తన కుటుంబంతో కలిసి 10X10 టిన్ షెడ్లో నివసిస్తున్న పూజారాణి
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం వలస కూలీల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల వలస కూలీలు పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఇప్పటికీ ఆ కష్టాల్లోనే చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. కొందరికి కనీస నివాసం లేక ఫుట్పాత్లపైనే బతుకుతున్నారు. అలాంటి ఓ కుటుంబానికి చెందిన పూజారాణి అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. హర్యానాకు చెందిన ఆ విద్యార్థిని సీబీఎస్ఈ విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 80.4% మార్కులు సాధించింది.
కాగా, మంచి మార్కులతో పాసైన పూజారాణిని కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ ప్రశంసించారు. ప్రతిభకు ఏదీ అడ్డం కాదని, అసాధ్యమైనదేదీ లేదని కొనియాడారు. ‘‘తన కుటుంబంతో కలిసి 10X10 టిన్ షెడ్లో నివసిస్తున్న పూజారాణి ఏమీ అసాధ్యం కాదని నిరూపించింది. పూజా.. నువ్వు చాలా మందికి ప్రేరణ’’ అని తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కేంద్రమంత్రి రాసుకొచ్చారు.
Updated Date - 2020-07-13T23:56:59+05:30 IST