ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ అయస్కాంత క్షేత్ర ఆవిర్భావానికి కారణం ‘మ్యాంటిల్‌’

ABN, First Publish Date - 2020-03-16T09:26:40+05:30

భూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈప్రశ్నకు ఇప్పటివరకు భూమిలోని ‘కోర్‌’ పొర అనే సమాధానం వినిపించేది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు

లాస్‌ ఏంజెలిస్‌, మార్చి 15 : భూ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈప్రశ్నకు ఇప్పటివరకు భూమిలోని ‘కోర్‌’ పొర అనే సమాధానం వినిపించేది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం ‘మ్యాంటిల్‌’ పొర అని బదులిస్తున్నారు. తమ అధ్యయనంలో ఈవిషయమే తేలిందని వారు వాదిస్తున్నారు. భూమి పైపొర ‘క్రస్ట్‌’పై మనం జీవిస్తున్నాం.


దాని కింద మ్యాంటిల్‌, ‘కోర్‌’, లిథోస్పియర్‌, ఎస్తెనోస్పియర్‌ అనే మరో నాలుగు రకాల పొరలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉంటాయి. మ్యాంటిల్‌ పొర దిగువ భాగంలోని ద్రవరూప సిలికేట్‌ విద్యుత్‌ వాహకంగా పనిచేసి భూమికి బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పర్చుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అయస్కాంత క్షేత్రం ప్రభావంతో సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాలు భూమిపైకి చేరకముందే దారిమళ్లిపోతాయి. ఒకవేళ ఇదే లేకుంటే సూర్యుడి అతినీల లోహిత కిరణాల నుంచి భూమండలాన్ని కాపాడే ఓజోన్‌ పొర ఎప్పుడో ఛిద్రమైపోయేది.

Updated Date - 2020-03-16T09:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising