వింత చోరీ: పూజలు చేసి, దక్షిణలు సమర్పించి...
ABN, First Publish Date - 2020-10-18T17:35:11+05:30
రాత్రి 12 గంటల సమయంలో ఒక దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. దేవతా విగ్రహాల ముందు నిలుచుని ప్రార్థనలు చేశాడు. హుండీలో డబ్బులు వేశాడు. తరువాత హుండీ తాళం పగులగొట్టి, దానిలోని సొమ్మునంతా తీసుకుని పరారయ్యాడు. ఉదయం పూజారులు...
చెన్నై: రాత్రి 12 గంటల సమయంలో ఒక దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. దేవతా విగ్రహాల ముందు నిలుచుని ప్రార్థనలు చేశాడు. హుండీలో డబ్బులు వేశాడు. తరువాత హుండీ తాళం పగులగొట్టి, దానిలోని సొమ్మునంతా తీసుకుని పరారయ్యాడు. ఉదయం పూజారులు ఆలయం తెరిచారు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువనమియుర్లోని మరుండేశ్వర్ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలోగల సీసీటీవీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిని పరిశీలించిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఒక యువకుడు మాస్క్ ధరించి, ఆలయంలోకి ప్రవేశించాడని, దేవతా మూర్తుల ముందు నిలుచుని, ప్రార్థనలు చేశాడని తెలిపారు. తరువాత ఒక రాడ్ సాయంలో హుండీని పగులగొట్టి, దానిలోని సొమ్మును తీసుకుని పరారయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-10-18T17:35:11+05:30 IST