ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్ వ‌రుడు... నేపాలీ వ‌ధువు... 12 నిముషాల్లో పెళ్లి!

ABN, First Publish Date - 2020-07-15T16:54:24+05:30

ఆ జంట‌ వివాహంతో ఒక్క‌ట‌య్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆ జంట‌ వివాహంతో ఒక్క‌ట‌య్యేందుకు ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను తెరిచాయి. పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు త‌న తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జ‌రిగే త‌మ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు. సాధార‌ణంగా హిందూ వివాహాలు ఆరు నుండి ఏడు గంటల పాటు జ‌రుగుతాయి. అయితే వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. నేపాల్ పరిపాలనా విభాగం అనుమ‌తితో భార‌త్‌లోని పిథోరాగఢ్‌కు చెందిన కమలేష్ చంద్ త‌న వివాహం కోసం నేపాల్‌లోని దర్చులాకు చేరుకున్నాడు. పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్ర‌భుత్వ అనుమ‌తి మేర‌కు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. ద‌ర్చులాలో వ‌రుడు, వ‌ధువు దండ‌లు మార్చుకున్నారు. వెంట‌నే ఆ కొత్త దంప‌తులు భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. కాగా మార్చి 22న  వీరి వివాహం జ‌ర‌గాల్సివుంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డింది. 

Updated Date - 2020-07-15T16:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising