ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ..!

ABN, First Publish Date - 2020-09-21T20:37:06+05:30

బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం తమ వినియోగదారులకు బంపర్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి ఇంధనం నింపుకునే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సర్వీస్ స్టేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ఓల్డ్ మద్రాసు రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందనీ... వెజ్, నాన్‌వెజ్ వెరైటీలు రెండూ అందిస్తామన్నారు.


అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ ఫ్యూయల్ స్టేషన్ కొన్ని షరతులు కూడా పెట్టింది. వీటి ప్రకారం రూ.2 వేలు ఆపైన ఇంధనం నింపుకున్న వారికే బిర్యానీ ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు రూ.250 ఆపైన ఇంధనం నింపుకున్న వారికి కూడా ప్రోత్సాహక బహుమానాలు ఇవ్వనున్నారు. ‘‘51 సంవత్సరాల నుంచి మేము ఈ ఐవోసీ సర్వీస్ స్టేషన్ నిర్వహిస్తున్నాం. కర్నాటకలో అత్యధిక ఇంధన అమ్మకాలు చేస్తున్న రికార్డు కూడా మాకే దక్కింది. ఇన్నేళ్లుగా మమ్మల్ని ఆదరిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. నెలరోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగిస్తాం. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత వివిధ రకాల ఉత్పత్తులను 50 శాతం తక్కువ ధరకే విక్రయించాలని యోచిస్తున్నాం...’’ అని సదరు పెట్రోల్ బంకు యజమాని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T20:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising